రజనీకాంత్, కమల్హాసన్.. దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న ఇద్దరు దిగ్గజాలు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. కమల్హాసన్కు తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన షెవలీర్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డు పూర్తిపేరు.. షెవలీర్ డి లార్డ్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్. 'నైట్ ఇన్ ద నేషనల్ ఆర్డర్ ఆర్ట్స్ అండ్ లెటర్స్' అని దానికి అర్థం. కమల్కు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. వెంటనే రజనీకాంత్ స్పందించారు. తమ తరంలో ఉన్న నడిగర తిలకం కమల్హాసన్కు షెవలీర్స్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తమిళంలో ట్వీట్ చేశారు.
సాధారణంగా నడిగర తిలకం అని విశ్వవిఖ్యాత తమిళనటుడు శివాజీ గణేశన్ను అంటారు. అయితే, ఈ తరంలో నడిగర తిలకం మాత్రం కమల్ హాసనే అంటూ రజనీ ట్వీట్ చేయడం విశేషం. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే రజనీ.. ఇటీవల మాత్రమే ఒకటి రెండు అంశాలపై స్పందిస్తున్నారు. పీవీ సింధు రజత పతకం సాధించిన వెంటనే.. 'నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ కమల్ను అభినందించేందుకు తన సోషల్ మీడియాను వాడుకున్నారు.