మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ప్రతీ వారితో తన ప్రేమపూర్వకమైన ప్రవర్తనతో ఆకట్టుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం తుది శ్వాస విడిచారు దర్శకరత్న దాసరి నారాయణ రావు.
తాజాగా జరిగిన కాదలి ఆడియో ఫంక్షన్ కు రామ్ చరణ్.. కేటీఆర్ లు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చెర్రీ చేతికి మైక్ ఇవ్వగానే..ముందుగా దాసరి గారు చనిపోయిన తర్వాత జరుగుతున్న పెద్ద ఫంక్షన్ ఇది కావడంతో.. అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాం అంటూ మెచ్యూరిటీ లెవెల్స్ చూపించాడు. వుయ్ మిస్ యూ సార్ అంటూ ఆయనపై గౌరవాన్ని మరోసారి చాటుకున్నాడు. ఏ సెలబ్రిటీ అవసరం లేదంటూ.. ఆయనే ఓ సెలబ్రిటీ అంటూ కేటీఆర్ అంటూ తెలంగాణ ఐటీ మంత్రిని ప్రశంసల్లో ముంచెత్తాడు చెర్రీ.
కాదలి విజువల్స్ నేను ముందే చూశాను. నా కెరీర్ లో అత్యంత ఫేవరేట్ ఫిలిం ఆరెంజ్. మరోసారి ఆ స్థాయి విజువల్స్.. కలర్స్.. మ్యూజిక్ అన్నీ ఆకట్టుకున్నాయి అన్నాడు చెర్రీ.