Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Sep-2016 12:37:44
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం తెలుగులో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పేయొచ్చు. రామ్ చరణ్ ధృవ తో పాటు మహేష్ బాబు-మురుగదాస్ సినిమాలోనూ ఆమే కథానాయిక. అక్కినేని నాగచైతన్య సరసనా ఓ సినిమా చేస్తోంది. తెలుగులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్లలో కూడా ఆమె ఒకరు. ఐతే ఇప్పుడంత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రకుల్ ప్రీత్.. కెరీర్ ఆరంభంలో తన తొలి సినిమాకు తీసుకున్న పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె తన తొలి సినిమాకు కేవలం రూ.6 లక్షలు పారితోషకంగా అందుకుందట. ఐతే ఆ సినిమా కన్నడలో చేసిన తొలి సినిమా ?గిల్లి?నా.. తెలుగులో చేసిన ?కెరటం? సినిమానా.. తమిళంలో చేసిన ?తడైయార తాక్కా?నా అనేది చెప్పలేదు.

ఇక ఇప్పుడు పారితోషకం లెక్కల గురించి రకుల్ దగ్గర ప్రస్తావిస్తే.. ??నేను ఎంత పారితోషకం తీసుకోవడానికి అర్హురాలినో అంతే తీసుకుంటున్నా. అంతకు మించి ఏమీ కాదు?? అని రకుల్ చెప్పింది. ప్రస్తుతం తనకు చేతి నిండా సినిమాలున్నాయని.. రకరకాల కారణాల వల్ల గత కొన్ని నెలల్లో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశం కోల్పోయానని రకుల్ తెలిపింది. మహేష్ బాబు లాంటి హీరోతో.. మురుగదాస్ లాంటి దర్శకుడితో పని చేస్తుండటం గొప్ప అనుభూతి అని.. దీంతో పాటు తాను చేస్తున్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులేనని.. ఇవి తన కెరీర్ కు చాలా ఉపయోగపడతాయని రకుల్ తెలిపింది. రకుల్ చేస్తున్న వాటిలో ?ధృవ? డిసెంబర్లో రాబోతుండగా.. మహేష్.. నాగచైతన్య సినిమాలు వేసవిలో విడుదలవుతాయి.

,  ,  ,  ,  ,  ,