ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో రకుల్ ప్రీత్ సింగ్ అగ్రకథానాయిక అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సరైనోడు (ఏప్రిల్ 22) విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు బోయపాటి శీను తను తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేయబోయే సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట.
సరైనోడు సినిమా చేస్తున్న సమయంలో రకుల్ నటనతో పాటు, తన పద్దతులతో పాటు పని పట్ల తన వైఖరి దర్శకుడు బోయపాటిని ఆకట్టుకోవడంతో రకుల్ ప్రీత్ కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ తో ధృవ, మలినేని గోపిచంద్ దర్శకత్వంలో సాయిధరం తేజ్ తో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది రకుల్. మరి అనుకోకుండా వచ్చిన ఈ సినిమాకి డేట్స్ ఎలా సర్దుతుందో మరి..?