సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్ రకుల్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ?మురుగదాస్-మహేష్లతో ఫస్ట్ డే షూటింగ్. సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది?అని దీనిపై ట్వీట్ చేసింది రకుల్. రకుల్ కు మహేష్ తో జతకట్టడం ఇదే తొలిసారి.
న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ చిత్రానికి ఎనిమి, జస్టిస్.. వాస్కోడ గామా అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి. అయితే ఇందులో ఎనీమీ టైటిల్ ఫైనల్ అయ్యే చాన్స్ ఎక్కువని అంటున్నారు. ఈ సినిమాకు హారిష్ జయరాజ్ మ్యూజిక్, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ. ఠాగూర్ మధు సమర్పకుడు. ఎన్వీ ప్రసాద్ నిర్మాత.