?వెంకటాద్రి ఎక్స్ ప్రెస్? సినిమాతో హిట్ అందుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ కొట్టేస్తూ, వరుసగా హిట్స్ అందుకుంటూ అనతి కాలంలోనే టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. గతంలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు సైన్ చేయడం ఆపేసింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఎన్.టి.ఆర్ సరసన ?నాన్నకు ప్రేమతో? మరియు అల్లు అర్జున్ సరసన ?సరైనోడు? సినిమాలలో నటిస్తోంది. ఈ సినిమాల తర్వాత రకుల్ ప్రేత్ మరో ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు.
దానికి కారణం ఈ మధ్య రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేసిన కిక్ 2, బ్రూస్ లీ సినిమా పెద్దగా ప్రేక్షకుల మన్ననలు అందుకోకపోవడమే కారణం. అందుకే ఇప్పుడు తన దగ్గరకు వస్తున్న ఆఫర్స్ అన్నిటినీ ఒప్పుకోకుండా, వచ్చిన సినిమాలలో తన పేరు తెచ్చేవి, హిట్ అవుతాయి అన్న సినిమాలనే ఎంచుకునే పనిలో ఉంది. ప్రస్తుతం రాకుల్ ప్రీత్ గోపీచంద్ మలినేని ? వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనుకుంటున్న ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాపై మాత్రమే ఆసక్తిగా ఉందని, దానికి కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. మరి ఇంత కేర్ తీసుకుంటున్న రకుల్ ప్రీత్ ఎలాంటి కథలతో, పాత్రలతో మన ముందుకు వస్తుందో చూడాలి.