ఓ పోస్ట్ పెట్టాడంటే అందులో చాలానే మీనింగ్స్ వెతికేసుకోవచ్చు. ఏదో యథాలాపంగా ట్వీట్స్ పెట్టడం.. పోస్టులు చేసే బాపతు కాదు ఈయన. ఒకవైపు రామ్ చరణ్.. మరోవైపు ఎన్టీఆర్ లతో రీసెంట్ గా రాజమౌళి ఓ ఫోటో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో తన నెక్ట్స్ మూవీ ఉంటుందని చెప్పేందుకు ఇది హింట్ అనే విషయాన్ని చాలా మంది పసిగట్టేశారు.
అది సరే కానీ.. చరణ్- ఎన్టీఆర్ కాంబో అంటే కచ్చితంగా క్రేజీ కాంబినేషనే. చెర్రీ-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర.. ఇండస్ట్రీ రికార్డులు తుడిచేసింది. ఇక ఎన్టీఆర్ తో దర్శకధీరుడి సినిమాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. మరి ఇప్పుడు ముగ్గురు కలిసి సినిమా చేయడం అంటే కచ్చితంగా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్టు అయిపోతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే జనవరి నుంచి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే సినిమాకు ప్రిపేర్ అయిపోతున్నాడు రామ్ చరణ్. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ కోసం 4 నెలలకు పైగా సమయం వెయిట్ చేస్తున్నాడు ఎన్టీఆర్.
ఈ రెండు సినిమాలు పూర్తి అయేందుకు మినిమం 6 నెలల సమయం పట్టినా.. ఆ తర్వాత చెర్రీ-ఎన్టీఆర్ లు త్రివిక్రమ్ ప్రాజెక్టుపై పని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇలా చూసుకుంటే.. ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టు మొదలయ్యేందుకే 2018 ద్వితీయార్ధం వచ్చేస్తుంది. జక్కన్న చెక్కుడుకు తగినట్లుగా సినిమా పూర్తయేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్లు సమయం పట్టచ్చని టాక్.