గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ వంటి వరుస పరాజయాల తరువాత రామ్ చరణ్ బిజినెస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు. మెగా అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలు, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు వచ్చిన విపరీతమైన క్రేజ్ అన్నీ కలిసి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అమాంతం పెంచేశాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క సీడెడ్ హక్కులు రూ. 9 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయట. ఎంతైనా రెండు వరుస ఫ్లాపులున్న హీరో సినిమాకి ఇంత భారీ మొత్తం పలకడం విశేషమేనని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే ఏ చిత్రం యొక్క ఉత్తరాంధ్ర రైట్స్ రూ.5.4 కోట్ల భారీ మొత్తానికి అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకోగా, నైజాం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా ఏరియాల్లో సినిమాని స్వయంగా అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క టాకీ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5న టీజర్ ను, అక్టోబర్ 7న చిత్రాన్ని విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది.