రామ్ చరణ్ హీరోగా రంగస్థలం 1985 అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటు దర్శకుడిగా బిజీ ఉంటూనే.. మధ్యమధ్యలో సినిమాలను నిర్మిస్తుంటాడు ఈయన. తన రచనలోనే గతంలో కుమారి 21ఎఫ్ ను నిర్మించిన సుకుమార్.. ప్రస్తతం దర్శకుడు అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో దర్శకుడు రూపొందుతుండగా.. ఇప్పుడీ మూవీ ప్రమోషన్స్ కోసం మెగా హెల్ప్ తీసుకుంటున్నాడు సుకుమార్. ఈ నెల 15న దర్శకుడు మూవీకి ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనుండగా.. ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడట. ఇటు తను తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న హీరోను.. తన నిర్మాణంలో రూపొందిన మూవీ ప్రమోషన్ కోసం ఉపయోగించేస్తున్నాడు సుక్కు. రామ్ చరణ్ రాకతో.. దర్శకుడు మూవీపై మెగా ఫ్యాన్స్ ఫోకస్ కూడా పడే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే.. ఇలా ప్లాన్ చేసినట్ుల తెలుస్తోంది.
స్వార్ధంతో నిండిపోయిన ఓ దర్శకుడు.. తన నిజ జీవితంలో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీకి పబ్లిసిటీ కోసం.. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్.. సమంత.. రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా సాయం చేశారు. ఈ మూవీ టీజర్ ను ఎన్టీఆర్ లాంఛ్ చేశాడు. సమంత.. రకుల్ ప్రీత్ ల చేతుల మీదుగా పాటలను విడుదల చేయించారు.