రామ్ చరణ్ ప్రస్తుతం ఒకే ఒక్క ప్రాజెక్టులో నటిస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మెరుపు' చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా పూర్తయితే తదుపరి సినిమా ఎవరితో? ఫైనల్ అయ్యిందా? లేదా? ఇంతవరకూ ఇక్క డీటెయిల్ కూడా బైటికి రాలేదు. అయితే చరణ్ దృష్టిలో ఎవరున్నారు? అన్నది ఓ మిస్టరీ.
రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి లిస్టులో ఉన్నాడు. ఈపాటికే ఓ స్టోరీ లైన్ వినిపించిన సూరికి చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అప్పట్లో అనుకున్నారు. చెర్రీ కోసం కథ రాసుకుంటున్నా లేటెస్ట్ ఇంటర్వ్యూ లో సూరి రివీల్ చేశాడు. అయితే ఇంతవరకూ చరణ్ అతడితో సినిమా విషయమై నోరు మెదపనే లేదు. సురేందర్ రెడ్డితో ఉంది అని కన్ఫమ్ చేయలేదు. అయితే సురేందర్ రెడ్డి పరిస్థితి 'కిక్2'కి ముందు కిక్2కి తర్వాత అన్నచందంగా మారిపోయింది.
కంటెంట్ లేని కిక్2 చూసి థియేటర్లలో ప్రేక్షకులు పెదవి విరిచేశారు. దీంతో ప్రస్తుతానికి చెర్రీతో ప్రాజెక్టు డైలమాలో ఉన్నట్టేనని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎవరైనా కథలు వినిపిస్తే వినేందుకు చరణ్ కూడా రెడీగానే ఉన్నాడు. ఎవరికీ కమిటవ్వలేదు కాబట్టి ఏం జరుగుతుందో? అన్న ఆత్రుత అందరిలోనూ ఉంది. సెలక్టివ్ ఎంపికలతో ముందుకు వెళుతున్న చెర్రీని డైరెక్ట్ చేసే అవకాశం అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.