రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ.. మరో మూడు వారాల్లో షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే కొంత గ్యాప్ ఇచ్చి.. ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ కొత్త ప్రాజెక్టు మొదలుపెడతాడు.
సుక్కుతో సినిమా ఉంటుందని గతంలోనే చరణ్ చెప్పేశాడు. ఈ సినిమా స్టోరీపై చాలా రకాల ప్రచారాలు జరిగాయి. సైంటిఫిక్ మూవీ అని.. లవ్ స్టోరీ అని.. పల్లెటూరి ప్రేమ అని.. ఇలా రకరకాల టాక్ వచ్చింది కానీ అసలు కథేంటో తెలియలేదు. తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక ఎక్స్ పెరిమెంట్ చేస్తున్న సుకుమార్.. చరణ్ కోసం అలాంటివన్నీ మానేసి.. ప్లెయిన్ లవ్ స్టోరీ తీస్తాడని అన్నారు. కానీ అలాంటివేమీ సుక్కు పట్టించుకోలేదని.. సుక్కు-చెర్రీల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ పల్లెటూరి ప్రేమకథే అయినా.. ఇదో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తారట.
పాతికేళ్ల క్రితం సెల్ ఫోన్లు లేని కాలంనాటి ఓ అందమైన ప్రేమకథను ఆవిష్కరిస్తాడట సుక్కు. అందుకే ఈ ప్రాజెక్ట్ చెర్రీకి నచ్చేసిందని అంటున్నారు. మరి 400 ఏళ్ల క్రితం ప్రేమకథ అంటూ పీరియాడిక్ మూవీలో రామ్ చరణ్ నటించినపుడు.. బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఇప్పుడు మరోసారి పీరియాడిక్ మూవీ అనగానే.. మెగాఫ్యాన్స్ మరో మగధీర అనుకుంటూ సంబరాలు స్టార్ట్ చేసేస్తున్నారు.