మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ?ధృవ? సినిమా ప్రస్తుతం హైద్రాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదలైన తన ?బ్రూస్లీ? సినిమా తర్వాత అభిమానులతో పెద్దగా ముచ్చటించని రామ్ చరణ్, ధృవ షూటింగ్ చేస్తూనే, కాస్త వీలు కుదుర్చుకొని అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమైపోయారు. సోషల్ మీడియాలో తాను ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండే ఫేస్బుక్లో చరణ్ ఈ రోజు వీడియో చాట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రశ్నలు రెడీ చేసుకోమని ఆయన టీమ్ అభిమానులకు తెలిపింది.
సుమారు 35 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న చరణ్ ఫేస్బుక్లో అభిమానులంతా ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. దీంతో పాటు డబ్స్మ్యాష్తో మెప్పించిన వారికి నేరుగా తనను సెట్లో కలిసే అవకాశాన్ని కూడా రామ్ చరణ్ కల్పించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ?ధృవ? సినిమా విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కార్పోరేట్ స్థాయి నేరాలను ఎదుర్కొనే పోలీస్ ఆఫీసర్ కథగా మెప్పించనుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.