తమిళంలో ఘన విజయం సాధించిన ?తని ఒరువన్? సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగులో ?ధృవ? పేరుతో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్దినెలల క్రితం వైభవంగా ప్రారంభమైన ఈ సినిమా ఎక్కడా ఆగకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హైద్రాబాద్, కశ్మీర్లలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన టీమ్, నేటినుంచి మళ్ళీ హైద్రాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ సహా ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇక ఈ సినిమా కోసం ఓ సరికొత్త లుక్ను ప్రయత్నించిన చరణ్, మూడో షెడ్యూల్ కోసం కథ రీత్యా వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకొని మరింత బరువు తగ్గారు. రామ్ చరణ్ మేక్ఓవర్ సినిమాకు ఓ స్పెషల్ హైలైట్గా నిలుస్తుందని టీమ్ చెబుతూ వస్తూంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. కార్పొరేట్ లెవెల్లో సాగే నేరాలను ఎదుర్కొనే ఓ పోలీసాఫీసర్ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్గా నటిస్తున్నారు.