చాలా వేగంగా సంపదను .. కీర్తిప్రతిష్ఠలను ఇచ్చే రంగాల్లో చిత్రపరిశ్రమ ముందువరుసలో కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తుంటారు గనుక పోటీ ఎక్కువగా వుంటుంది. అభద్రతా భావం కూడా అదే స్థాయిలో వుంటుంది. అందువలన మనసులు కాస్త ఇరుగ్గానే వుంటాయి. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించడానికి కూడా గొప్పమనసు వుండాలి. అలాంటి మనసు రాశీఖన్నాకి ఉందనే విషయాన్ని ఆమె మాటలు చెప్పకనే చెబుతున్నాయి. తమన్నా మంచి అందమైనదే కాదు .. అంతకి మించి మంచినటి, ఆమెతో కలిసి నటించడం తనకి ఏ విధంగాను ఇబ్బంది కలిగించలేదని రాశీఖన్నా చెబుతోంది.
'బెంగాల్ టైగర్' సినిమా కోసం వీళ్లిద్దరూ రవితేజా సరసన నటిస్తున్నారు. ఈ సినిమాలో రెండో కథానాయికగా రాశీఖన్నా కనిపిస్తుంది. రెండో కథానాయిక అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనీ, అసలు ఆడియన్స్ ఆ దృష్టితో చూడరని ఆమె అంటోంది. తమన్నా అగ్రకథానాయిక అనీ, ఆమెతో కలిసి నటించడం తనకి మంచి అనుభవమని చెప్పింది. గ్లామర్ తోను .. నటనతోనూ .. వ్యక్తిత్వం విషయంలోనూ తనపై ఆమె ప్రభావం చూపిందని సెలవిచ్చింది.