Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2016 15:23:35
facebook Twitter Googleplus
Photo

సినిమాలకు ఈ మధ్యకాలంలో బడ్జెట్ భారీస్థాయిలో పెరిగిపోతుంది. ఓవర్ సీస్ మార్కెట్ కూడా ఉందనే ధైర్యంతోనో ఏమో కానీ.. ఒక మోస్తరు స్టార్ హీరో సినిమాలు 50 కోట్లు - బాలీవుడ్ స్థాయి సినిమాలైతే 100కోట్ల పైనా బడ్జెట్ అవసరం అవుతుంది. ఈ క్రమంలో మణిరత్నం తాజా డ్రీం ఫిల్మ్ విషయం ఆగిపోవడానికి కూడా బడ్జెట్ విషయాలే కారణం అని అప్పట్లో తెలిసినా.. తాజాగా ఆ సినిమా ఆగిపోవడానికి గల కారణాలు తెలిసాయి.

దక్షిణాది దర్శక దిగ్గజం మణిరత్నం కొన్నేళ్లక్రితం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన "పొన్నియిన్ సెల్వన్" సినిమా ఇప్పటికీ హాట్ టాపిక్కే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - తమిళ స్టార్ హీరో విజయ్ - విశాల్ - అనుష్క శెట్టి లను ప్రధాన పాత్రల్లో తీసుకొని ఈ కథను భారీ ఎత్తున నిర్మించాలని ఆయన భావించారు. అయితే భారీ అంచనాలు మోయాల్సిన ఈ భారీ చిత్రం ప్రీ- ప్రోడక్షన్ దశలోనే ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఆగిపోవడంపై రకరకాల వదంతులు వచ్చినప్పటికీ తాజాగా అసలు విషయం చెబుతున్నారు ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం మణిరత్నంతో కలిసి పనిచేసిన రచయిత జయమోహన్.

తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన జయమోహన్ "తమిళనాడులో ఎన్నో దేవాలయాలు ఉన్నా కూడా ఏ ఒక్క దేవాలయంలోనూ ఈ సినిమా షూటింగ్ కు అనుమతి లభించలేదు.. దీంతో భారీస్థాయిలో దేవాలయాల సెట్టింగులు వేసి చిత్రీకరించాల్సిన పరిస్థితి వచ్చింది.. అప్పటికీ అలా చేయాలని నిర్ణయానికీ వచ్చినా ఈ సెట్టింగ్ ల కోసమే రూ. 50 కోట్లు ఖర్చు అవుతుండటంతో.. అది ఆర్థికంగా సాధ్యం కాదని తేల్చి ప్రీ-ప్రోడక్షన్ దశలోనే సినిమా ఆపేశారు" అని చెప్పారు.

కాగా.. భారీ తారాగణంతో తెరకెక్కించాలనుకున్న ఈ చారిత్రక సినిమాకు మొదట్లో రూ. 200 కోట్ల బడ్జెట్ అవుతుందని భావించారు. అంత బడ్జెట్ తో సినిమా తీయడం ఆర్థికంగా ఆచరణసాధ్యం కాకపోవడంతో దీనిని ఆదిలోనే ఆపేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

,  ,  ,  ,  ,  ,  ,