Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 11:44:44
facebook Twitter Googleplus
Photo

నందమూరి-అక్కినేని కుటుంబాల మధ్య ఒకప్పుడు ఎంత మంచి అనుబంధం ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వృత్తి రీత్యా ఒకరితో ఒకరు పోటీ పడ్డప్పటికీ వ్యక్తిగతంగా మంచి స్నేహితులుగా మెలిగారు ఎన్టీఆర్-ఏఎన్నార్. మధ్యలో కొన్ని ఇబ్బందులొచ్చినా ఇద్దరి మధ్య మంచి స్నేహమే ఉండేది. వాళ్లిద్దరి కంటే కూడా వారి వారసులు మరింత స్నేహంగా మెలిగారు. బాలయ్య.. నాగార్జున ఒకప్పుడు మంచి మిత్రులు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. అనుకోకుండా శత్రువులుగా మారిపోయారు. వాళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ ఏ స్థాయికి చేరిందంటే తానెప్పుడూ ప్రేమగా బాబాయి అని పిలుచుకునే ఏఎన్నార్ చనిపోతే కూడా బాలయ్య ఆయన అంతిమయాత్రలో కనిపించలేదు.

గత రెండు మూడేళ్లుగా బాలయ్య-నాగార్జున కలిసి ఎక్కడా కనిపించింది లేదు. ఒకప్పుడు నాగచైతన్య తొలి సినిమా ఆడియో వేడుకకు వచ్చి అతణ్ని ఆశీర్వదించిన బాలయ్య.. అఖిల్ అరంగేట్రం సందర్భంగా మాత్రం ఎక్కడా కనిపించకపోవడం కూడా గమనార్హమే. ఐతే తాజాగా బాలయ్య కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ?గౌతమీపుత్ర శాతకర్ణి? ఆరంభోత్సవం సందర్భంగా ఇండస్ట్రీలోని ప్రముఖులందరినీ పిలిచాడు బాలయ్య. తన సహచర స్టార్లయిన చిరంజీవి.. వెంకటేష్ లను కూడా ఈ వేడుకకు ఆహ్వానించాడు. వాళ్లిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. కానీ నాగార్జున మాత్రం ఈ వేడుకకు రాలేదు.

ఐతే బాలయ్య నాగ్ ను పిలిచాడా లేదా అన్నది క్లారిటీ రావట్లేదు. కొందరు పిలవలేదంటున్నారు.. ఇంకొందరేమో పిలిచినా రాలేదంటున్నారు. ఐతే బాలయ్య ప్రోగ్రాంకు రాకపోవడానికి సరైన కారణం చూపించడానిమో ఏమో కానీ.. ఆశ్చర్యకరంగా శుక్రవారమే ఉన్నట్లుండి నాగచైతన్య కొత్త సినిమా ఆరంభోత్సవం చేయించాడు నాగ్. చైతూ అందుబాటులో లేకున్నా సరే.. నాగార్జునే స్వయంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయించాడు. ఒకవేళ బాలయ్య పిలిచి ఉన్నా.. తాను రాలేకపోవడానికి ఇదే రీజన్ అని నాగ్ చెప్పదలుచుకున్నాడేమో

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,