Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Dec-2016 10:21:20
facebook Twitter Googleplus
Photo

వంగవీటి సినిమా ప్రకటన దగ్గరనుంచి విడుదలైన రోజు వరకూ ఆ సినిమాపై జరిగిన చర్చ అంతా ఇంతాకాదు. ఇదే క్రమంలో సినిమా విడుదలైనప్పటినుంచీ జరుగుతున్న రచ్చ కూడా అంతా ఇంతా కాదనే చెప్పాలి. వంగవీటి రంగా అభిమానులు వంగవీటి రంగ కుమారుడు రాధ - "వంగవీటి" సినిమా దర్శకుడు రాం గోపాల్ వర్మ మధ్య జరుగుతున్న వార్ రోజు రోజుకీ రసవత్తరంగా మారుతూనే ఉంది. అయితే తాజాగా వంగవీటి అభిమానులు - రాధా రంగా మిత్రమండలి పై రాంగోపాల్ వర్మ సీరియస్ గానే స్పందించారు.

వర్మ లేటెస్ట్ మూవీ "వంగవీటి" లో రంగాను ఒక రౌడీగా చూపించారన్న రంగా అభిమానుల ఆరోపణలను ఏమాత్రం లక్షపెట్టకుండా - విమర్శలకు తనదైన ప్రతివిమర్శలు చేస్తూ పోతున్న వర్మ.. తాజాగా రాధా రంగా మిత్రమండలిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనీపాటా లేకుండా వీధుల్లో తిరిగే వారంతా రంగా - రాధాల పేరు చెడగొట్టడానికి పుట్టారని నిప్పులు చెరిగారు. వారి వారి లోపలి కుళ్లును పెట్రోలు కూడా లేకుండా తగలబెడతానని హెచ్చరించారు. ఇక వారు డిమాండ్ చేస్తున్నట్లుగా... తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతరం మరింత సీరియస్ గా స్పందించిన ఆర్జీవీ... రంగా రాధా అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ "ఇంకా మీరు ఎక్కువ చేస్తే మీరంతా ఎవరెవరు ఏ జాతి అన్న విషయం మొత్తం బయటపెడతా" అని అన్నారు.

కాగా "వంగవీటి" సినిమాలో కాపులను అవమానించే రీతిలో రంగా అభిమానుల మనోభావాలను కించపరిచే స్థాయిలో ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని ఏపీ డీజీపీ - హ్యూమన్ రైట్స్ కమిషన్ లకు రాధా - వంగవీటి అభిమానులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై మాట్లాడుతున్న వంగవీటి అభిమానులు... తాము షూటింగులో పాల్గొన్నప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలేవీ ప్రస్తుతం ప్రదర్శితమవుతున్న సినిమాలో లేవని రంగా చేసిన సమాజసేవ గురించి చూపించలేదని అందువల్ల వాటిని కూడా కలిపి సినిమాను రీ రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో.. "వర్మకు డబ్బులే కావాలనుకుంటే తామంతా చందాలు వేసుకుని ఇచ్చేవారమని" రాధా విమర్శించారు. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్లి ఆగుతుందనేది వేచి చూడాలి!

,  ,  ,  ,  ,  ,  ,