శ్రీకాంత్ తనయుడు రోషన్ తెరంగేట్రం చేస్తోన్న చిత్రం ?నిర్మలా కాన్వెంట్?. అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో నాగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
గురువారం హైదరాబాద్ లో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అరవింద్ బిగ్ సీడీ విడుదల చేసారు. ఆడియో సీడీలను నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల చేసి తొలి సీడీని అల్లు అరవింద్ కు అప్పగించారు.
అయితే, ఈ ఆడియో వేదికపై శ్రీకాంత్ తనయుడు రోషన్ ఎమోషన్ అయ్యాడు. కన్నీరు పెట్టుకొన్నాడు. తల్లిదండ్రులు గర్వపడేలా, ప్రేక్షక దేవుళ్లు ఆదరించే విధంగా ఉంటానని ఎమోషనల్ గా మాట్లాడారు.
నాగార్జున మాట్లాడుతూ.. ?75 యేళ్ల క్రితం ఘంటశాల బలరామయ్యగారు మా నాన్న గారిని (అక్కినేని నాగేశ్వర రావు) పిలిచి చూసి.. కుర్రాడు బాగున్నాడే చలాకీగా.. ? అనుకొని యాక్టర్ ని చేశారు. ఆయన నాన్నగారికి అవకాశం ఇవ్వడంతోనే మేము ఈరోజు ఇక్కడున్నాం. ఎప్పుడు కొత్తగా ఆలోచించాలి, కొత్తవారిని ప్రొత్సహించాలని నాన్నగారు చెప్పేవారు.. ఆయన స్పూర్తితోనే ముందుకెళ్తున్నా?మన్నారు.