తెలుగులో ఒక్క హిట్టూ లేకపోయినా టాలీవుడ్ ని వదిలే ప్రసక్తే లేదన్నట్టు వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు ముంబయ్ కుర్రాడు సచిన్ జోషి. ఆమధ్య తాను చేసిన 'ఆషికి 2' తెలుగు రీమేక్ 'నీ జతగా నేనుండాలి' ఫ్లాపయింది. అయినప్పటికీ, తానే నిర్మాత కూడా కాబట్టి ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తాను హీరోగా 'మొగలిపువ్వు' సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలో సచిన్ మరో సినిమా కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. తాతినేని సత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ భామ ఇషా గుప్తా కథానాయికగా నటిస్తుంది. త్వరలోనే ఇది సెట్స్ కి వెళుతుందట.
sachin, rgv, mogalipuvvu, news,