Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 16:34:54
facebook Twitter Googleplus
Photo

జనవరి 7న మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవి అయిన ''ఖైదీ నెం 150'' ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ దగ్గర్లోని హాయ్ ల్యాండ్ లో గ్రాండుగా జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంటుకు మెగా హీరోలందరూ అటెండ్ అవుతారు కాని.. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాస్త డౌట్. అదంతా సరే.. వీరు కాకుండా ఈవెంటుకు ఎవరైనా చీఫ్ గెస్టులు వస్తున్నారా??

మెగా అభిమానులు సైతం స్టన్ అయ్యే విషయం ఏంటంటే.. ఈ ఈవెంటుకు లెజండరీ డైరక్టర్ దాసరి నారాయణరావు మెయిన్ గెస్ట్ కాగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చీఫ్ గెస్ట్. ఈ విషయాన్ని స్వయంగా సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కూడా కన్ఫాం చేసేశాడు. ఎప్పుడూ చిర్రుమంటూ చిరంజీవిపై ఏదో ఒక పంచ్ వేస్తూ..మెగా హీరోలకు కాస్త చురకలు అంటిస్తారని దాసరి నారాయణరావుపై ఫ్యాన్స్ మండిపడుతుంటారు. అటువంటి ఆయన్ను ఇప్పుడు
మెయిన్ గెస్ట్ అంటే.. ఇక చూస్కోండి మరి. ఈ మధ్యన మారుతున్న రాజకీయ సమీకరణాలు కారణంగా దాసరి మెగా క్యాంపుకు దగ్గరయ్యారని ఈ ఈవెంట్ సాక్ష్యం అవుతుందేమో.

ఇంతకీ ఈవెంటుకు పవర్ స్టార్ ఎందుకు రావట్లేదు చెర్రి అంటే.. ''నేను వపర్ స్టార్ ను కలవడానికి ఇవాళ వెళ్తున్నాను. నేను ఇన్విటేషన్ ఇస్తాను. రావొచ్చు రాకూడదు అనేది ఆయన ఇష్టం. ఆయన చిన్నపిల్లాడు కాదు. వీలుంటే వస్తారు లేదంటే లేదు'' అన్నాడు మెగా పవర్ స్టార్. అది సంగతి.

,  ,  ,  ,  ,  ,