Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2017 16:20:43
facebook Twitter Googleplus
Photo

ఎవరి స్థాయి మేరకు వారు మంచి హిట్స్ తో దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ కాస్త స్లో అయ్యాడు. తిక్క - విన్నర్ పరాజయాలతో సతమతమయిన సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నక్షత్రం కూడా నిరాశే మిగిల్చింది. అయితే మరి కొన్ని రోజుల్లో జవాన్ సినిమాతో రాబోతున్న సాయి ధరమ్ తేజ్ ఆ సినిమా పూర్తవ్వకముందే మరో సినిమాను లాంచ్ చేశాడు.

వివి వినాయక్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఒక మాస్ చిత్రంతో రాబోతున్నాడు ఈ మెగా హీరో. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు పరుచూరి వెంకటేశ్వర రావ్ మొదటి క్లాప్ కొట్టారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ చెబుతూ.. సాయి ని ఆశీర్వదించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షీటీంగ్ ని స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఖైదీ నెం 150 సినిమాకు ముందు వివి వినాయక్ ను అఖిల్ సినిమా రిజల్ట్ గట్టిగానే వేధించింది. ఆ తరువాత మెగాస్టార్ హెల్ప్ చేయడంతో సరిపోయింది. కాని ఆ సినిమా పూర్తయ్యాక కూడా వినాయక్ కొత్త సినిమాను పట్టాలెక్కించడంలో స్లో అయ్యాడు. పెద్ద హీరోలు ఎవరితో చేయాలా అనే మీమాంశలో ఉండిపోయాడు. ఎవరు డేట్లు ఇస్తారో కూడా క్లారిటీ లేదట. ఆ సమయంలో సాయిధరమ్ బెటర్ అని ఇటొచ్చాడు. ముందులో అవన్నీ రూమర్లే అని చెప్పినా.. ఇప్పుడు వినాయక్ అండ్ సాయిధరమ్ కాంబినేషన్ వర్కవుటైంది.

ఇక తేజు సరసన లావణ్య త్రిపాఠి హీరయిన్ గా నటిస్తుండగా సి కళ్యాణ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ ఆకుల కథను అందించారు. మిగతా యూనిట్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

,  ,  ,  ,  ,