సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ?తిక్క?. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మలేషియాలో జరుపుకుంటుంది?ఈ సందర్భంగా చిత్ర హీరో , యూనిట్ & నటులతో కలిసి సెల్ఫీ తీసుకున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు..
ఈ ఫోటోలో సాయిధరమ్ తేజ్తో పాటు సప్తగిరి, ఆలీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ ఉన్నారు. నిన్న రాత్రి షూటింగ్ను బాగా ఎంజాయ్ చేశామని తేజ్ ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన లారిస్సా భొనెసి జంటగా నటిస్తుండగా? రాజేంద్ర ప్రసాద్ హీరో ఫాదర్గా, రావు రమేష్ హీరోయిన్ ఫాదర్గా నటిస్తున్నారు. సి.రోహిణ్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.