Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 12:35:43
facebook Twitter Googleplus
Photo

ప్రేమమ్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమా అంతగా హిట్ కావడానికి కారణం సినిమాలో నటించిన హీరోయిన్సే అని చెప్పాలి. ముగ్గురు హీరోయిన్స్ సాయి పల్లవి.. అనుపమ పరమేశ్వరన్ అండ్ మడోన్నా సెబాస్టియన్ ఎవరి స్టైల్ లో వారు నటించి ప్రేమమ్ హిట్ ను సమానంగా పంచుకున్నారు. సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ షో లేదు అదే విధంగా హాట్ సీన్స్ అసలే లేవు. కేవలం ఒక సాధారణ ప్రేమ కథతో అందరికి చేరువయ్యారు.

ప్రేమమ్ హిట్ తర్వాత ఈ ముగ్గురు భామలు అదే స్టామినాను చూపిస్తున్నారు. వరుస హిట్స్ ను అందుకుంటున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి అందరికంటే ఎక్కువగా ఫెమస్ అయ్యింది. అమ్మడు ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అనుపమ కూడా బాగానే రాణిస్తోంది. ఇక మందోన కూడా తనదైన శైలిలో నటిస్తూ అవకశాలను దక్కించుకుంటోంది. అయితే ఈ ప్రేమమ్ హీరోయిన్స్ అందరి దృష్టిలో పడిన తర్వాత డైరెక్టర్లు - హీరోలు వారితో ఒక సినిమాను చేయాలని అనుకున్నారు. కానీ ముగ్గురిని ఎవరూ కవర్ చేయలేదు. అయతే తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం ఆ ఇష్టాన్ని తీర్చేసుకున్నాడు.

కథల బలమో లేక అదృష్టమో తెలియదు గాని ధనుష్ ప్రేమమ్ హీరోయిన్స్ తో జోడి కట్టేశాడు. మొదట అనుపమ పరమేశ్వరన్ ని తన కోడి సినిమాలో లీడ్ రోల్ లో తీసుకొని మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మడోన్నా సెబాస్టియన్ ని పవర్ పాండి సినిమాలో కవర్ చేసి మెప్పించాడు. ఇక ఫైనల్ గా అల్లరి పిల్ల సాయి పల్లవి మిగిలిపోయింది కథా అనుకుంటుండగా.. ధనుష్ నెక్స్ట్ సినిమాలో ఆమె కూడా నటించనుంది. 2012 లో వచ్చిన మారి సినిమా సీక్వెల్ లో ఈ అమ్మడితో రొమాన్స్ చేయబోతున్నాడు.

,  ,  ,  ,  ,