సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయిరాం శంకర్ మొదట్లో మంచి గుర్తింపు లభించినా తరువాత సరైన విజయాలు లేక వెనుకబడ్డాడు. చాలా రోజుల తరువాత ఇప్పుడు మరో సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
యువతను ఆకట్టుకునే కథాంశంతో పూర్తి వినోదాత్మకంగా ఉండే ఈ సినిమాకి ?నేనోరకం? అని టైటిల్ పెట్టినట్లు తెలిసింది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. ఈ సినిమా ట్రైలర్ వచ్చేవారం విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేష్మి మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ్ నటుడు శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషించగా సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.