టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల జనాలు.. సౌత్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా చూస్తున్న పాయింట్ అక్కినేని నాగ చైతన్య-సమంతల వివాహమే. గోవాలో అక్టోబర్ 6-7 తేదీల్లో రెండు రోజుల వివాహ వేడుక జరగనుండగా.. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అటు నాగార్జున ఫ్యామిలీ నుంచి.. ఇటు దగ్గుబాటి సురేష్ కుటుంబం నుంచి.. మరోవైపు సమంత ఫ్యామిలీ నుంచి మొత్తం 150 మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరు కానున్నారు.
అయితే.. ఈ వివాహానికి అటెండ్ అయేవారికి సమంత ఓ విచిత్రమైన కండిషన్ విధించిందట. ఈ పెళ్లికి వచ్చేవారిలో ఎవరూ ఒక్క చిన్నపాటి వీడియో కూడా తీయరాదని కోరిందట సమంత. అంటే చైతు-సామ్ ల పెళ్లి వేడుకకు అటెండ్ అయేవారు ఎవరైనా సరే.. కావాలంటే ఎన్ని ఫోటోలు అయినా తీసుకోవచ్చు. కానీ చిన్నపాటి వీడియో కూడా అక్కడి నుంచి బైటకు రాకూడదన్నది కండిషన్ అన్నమాట. తమ పెళ్లికి సంబంధించిన వీడియోను.. తామే అందరికీ ఇస్తామని.. అప్పటివరకూ దయచేసి ఎవరూ వీడియోలు తీయవద్దని సమంత కోరిన కోరికకు దాదాపు అందరినుంచి అంగీకారం వచ్చిందని అంటున్నారు.