ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న యంగ్ టైగర్ యన్.టి.ఆర్ మళ్ళీ ఏప్రిల్ 14 నుండి జరుగబోయే తరువాత షెడ్యూల్ లో పాల్గోంటాడని తెలిసింది. అలాగే బ్రహ్మోత్సవం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న సమంత కూడా ఏప్రిల్ 14 జనతా గారేజ్ షూటింగ్ లో చేరవచ్చని సమాచారం.
మిర్చి, శ్రీమంతుడు లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వం లో ఈ సినిమా రాబొతున్న విషయం తెలిసిందే. స్టైలిష్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సమంత తో పాటు నిత్యమీనన్ కూడా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి దేవి ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ పతాకం పై నిర్మితమవుతున్న ఈ సినిమా లో యంగ్ టైగర్ ఐ ఐ టి స్టూడెంట్ గా నటిస్తుండటం విశేషం.