మొట్టమొదటి సారిగా త్రిష ఒక హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. సుందర్.సి దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఆ సినిమా పేరే 'అరణ్మని 2'. ఈ సినిమాలో త్రిష జోడీగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు. ఆయనకి ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం సమంతానే అనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు 'బొమ్మరిల్లు' .. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాల సమయంలో సిద్ధార్థ్ కి వున్న క్రేజ్ వేరు .. ఇప్పుడున్న పరిస్థితి వేరు.
తెలుగులో ఆయనకి అసలు సినిమాలు లేకపోగా, తమిళంలో చేసినవి పరాజయాల పాలవుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ ఒక్క సక్సెస్ వరించినా చాలు అన్నట్టుగా ఎదురుచూస్తున్నాడు. పాత పరిచయం కారణంగా అతని బాధ సమంతా అర్థం చేసుకుందని అంటున్నారు. అందుకే అతన్ని సుందర్.సి కి సిఫార్స్ చేసిందని చెబుతున్నారు. ఆమె మాట మేరకే సుందర్ ఆయన్ని తీసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే మరికొంతకాలం పాటు తమిళ్లో నిలదొక్కుకోవచ్చనేది సిద్ధార్థ్ ఆలోచన.