రజనీకాంత్కి ఏమైంది? ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అమెరికాలో ఉన్నారని తెలుసు కానీ.. ఎలా ఉన్నారు? చెన్నై ఎప్పుడు వస్తారు?.. వంటి ప్రశ్నలు, వాటికి ఎవరికి తోచిన సమాధానాలు వాళ్లు ఇచ్చుకోవడాలు.. కొన్ని సమాధానాలు నెగిటివ్గా ఉండటంతో అభిమానులు ఆందోళన పడడాలు.. ఇవన్నీ తెలిసినవే. దాదాపు నెల రోజుల క్రితం రజనీ అమెరికా వెళ్లారు. దాంతో కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారని, చికిత్స తీసుకోవడానికే అమెరికా వెళ్లారనే వార్త ప్రచారంలోకొచ్చింది. ??రొటీన్ చెకప్ నిమిత్తం రజనీ అమెరికా వెళ్లారు.
ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు?? అని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినప్పటికీ.. ఈ వార్తలు ఆగలేదు. పైగా ఈ నెల మొదటి వారంలో రజనీ ఇండియా వస్తారనే వార్త వినిపించింది. ఆయన ఇంకా రాకపోవడంతో రజనీ ఆరోగ్యం బాగాలేదనే అభిప్రాయం కొంతమందిలో బలపడింది. అయితే, రజనీ పెద్ద కుమార్తె ఐశ్వరా ధనుష్ ట్వీట్తో ఆయన ఆరోగ్యంగా ఉన్నారనే విషయం స్పష్టమైంది. ఆదివారం రజనీకాంత్ అమెరికాలోని ?సచ్చిదానంద ఆశ్రమం?ని సందర్శించారు. వర్జీనియా రాష్ట్రంలో గల ఈ ఆశ్రమాన్ని యోగవిల్లే, లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. ??సచ్చిదానంద ?లోటస్ ఆల్ ఫెయిత్స్ టెంపుల్? 30వ వార్షికోత్సవం సందర్భంగా నేను, అప్పా (నాన్న)?? అని పొన్ను (కూతురు) ఐశ్వర్య తండ్రితో కలసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని రజనీ ప్రతి ఏడాది సందర్శిస్తారట.