హీరోయిన్లలో సమంత సోషల్మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటుంది. తన సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ట్వట్టర్ లో పోస్ట్ చేస్తుంటుంది సమంత. అంతేకాకుండా తన సినిమా విశేషాలతోపాటు నాగచైతన్య గురించి కూడా సందర్భానుసారంగా ట్వీట్స్ చేస్తుంది. చైతూపై సమంత తాజాగా ఓ లవ్లీ ట్వీట్ చేసింది.
చైతూ హీరోగా నటిస్తున్న యుద్ధం శరణం సినిమా టీజర్ సోమవారం విడులైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ పై చైతూ ట్వీట్ చేశాడు. శత్రువులు ద్రోహం చేసినా. ఆశలు ఆవిరైనా. నా గూడు చెదిరినా... నేను ధైర్యంగా జీవించగలను అని ట్వీట్ చేశాడు. దీనికి సమంత రీట్వీట్ క్యూట్ గా రీట్వీట్ చేసింది. నా హీరో చాలా గ్రేట్ అంటూ సమంత ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వీరిద్దరి ట్వీట్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు యుద్ధం శరణం టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నం.1 ప్లేస్ లో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టీజర్ ను 11 లక్షల మందికిపైగా వీక్షించారు. 24 వేల మంది లైక్ చేశారు. ఈ చిత్రానికి ఆర్.వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చైతూ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది