హ్యాట్రిక్ హిట్స్తో జోరు మీదున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలను లైన్లో పెట్టి స్టార్ లీగ్లో చేరిపోయేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాల్లో మొదటిది ఆయన 25వ సినిమా కావడంతో, శర్వానంద్ ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే, ప్రముఖ నిర్మాత దిల్రాజుతో చేయబోయే సినిమాకు కూడా శర్వానంద్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ?శతమానం భవతి? పేరుతో తెరకెక్కే ఈ సినిమాకు వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించనున్నారు.
త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ను ఎంపిక చేశారు. మళయాల సినిమా ప్రేమమ్తో సంచలనంగా మారిపోయిన అనుపమ, తెలుగులో ఈమధ్యే విడుదలైన అ..ఆ..తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ప్రేమమ్ తెలుగు రీమేక్లోనూ నటిస్తోన్న అనుపమ, ఇప్పుడు శర్వానంద్ సినిమా కూడా ఒప్పుకొని తెలుగులో బిజీ హీరోయిన్గా మారిపోతున్నారు.