నేనింత చేస్తే అంతగా తె లుస్తోంది. నా అందమే అంత. దానికి నేనేం చేయను? అంటున్నారు నటి శ్రుతీహాసన్. ఈ బోల్డ్ అండ్ బ్యూటీ తొలుత నాయకిగా బాలీవుడ్లో రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అక్కడ తొలి చిత్రం లక్లోనే గ్లామర్ విషయంలో దుమ్మురేపారు. ఆ చిత్రం హిట్ అవ్వలేదు గానీ శ్రుతీహాసన్ మాత్రం విమర్శకుల నుంచి తప్పించుకోలేకపోయారు. అయినా తన రూట్ మార్చుకోలేదు. బాలీవుడ్ పత్రికల ముఖ చిత్రాలకు హాట్ హాట్ ఫోజులిచ్చి సంచలనం సృష్టించారు. అయితే తొలి రోజుల్లో లక్ లేకపోయినా ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న శ్రుతీహాసన్ను ఇటీవల ఒకరు గ్లామర్ విషయంలో ఎల్లలు దాటుతున్నారని అన్నారట.
అంతే శ్రుతికి ఎక్కడలేని కోపం వచ్చిందట. చాలా టెన్షన్కు గురైన ఈ ముద్దుగుమ్మ చాలా మంది గ్లామర్గా నటిస్తున్నారు. అయినా గ్లామర్ విషయంలో తన హద్దులు తనకున్నాయి. జనరంజకంగా ప్రేక్షకులను అలరించడానికి గ్లామర్ విషయంలో తానెప్పుడూ ఎల్లలు దాటలేదని అన్నారు. ఇంకా చెప్పాలంటే నా రూపమే గ్లామర్గా ఉంటుంది. తాను ఇంత చేస్తే అంతగా తెలుస్తుంది.
దానికి నేనేం చేయను? అంటూ ఘాటుగా బదులిచ్చారట. కాగా ప్రస్తుతం సూర్యతో ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న శ్రుతీహాసన్ తాజాగా తండ్రితో కలిసి శభాష్నాయుడు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే అమెరికాలో తొలి షెడ్యుల్ చిత్రీకరణను పూర్తి చేసుకుందన్నది గమనార్హం.