ఇటీవల 'పూజ' సినిమాలో శృతి హాసన్ తో కలసి నటించిన తమిళ, తెలుగు హీరో విశాల్ ఆమెతో మరోసారి జతకట్టడానికి రెడీ అవుతున్నాడు. గతంలో తాను లింగుసామి దర్శకత్వంలో నటించిన 'పందెంకోడి' సినిమా సూపర్ హిట్టయింది. విశాల్ ని మాస్ హీరోగా ఇది ప్రెజెంట్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి కూడా లింగుసామి దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్రకి శృతి హాసన్ ని సంప్రదిస్తున్నారట. ఇదిలా ఉంచితే, విశాల్ ప్రస్తుతం నటిస్తున్న 'అంబాల' సినిమా సంక్రాంతికి రిలీజవుతుంది.
vishal, shruthihasan, newmovie, tamil, news, linguswamy,