ప్రతీఏటా ముంబైలో జరిగే దహిహండీ... అంటే గోకులాష్టమికి ఉట్టికొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అమ్మాయిలూ అబ్బాయిలూ పెద్ద మొత్తంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సినిమా జనాలు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే... ఈ కార్యక్రమానికి ఒక హీరోయిన్ కి అతిధిగా పాల్గొనే అవకాశం వచ్చింది. అందుకు నిర్వాహకులు పెద్దమొత్తంలో ముట్టచెబుతామని కూడా అన్నారు కానీ... ఆమె తిరస్కరించింది.
అవును... గోకులాష్టమికి ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొంటే నిమిషానికి రూ. 15 లక్షలు అంటే... పది నిమిషాలకు మొత్తం రూ. కోటిన్నర! ఇటువంటి ఆఫర్ ని సునాయాసంగా నో చెప్పింది అనీల్ కపూర్ కూతురు సోనం కపూర్. దీనికి ఆమె చెబుతున్న కారణం... "ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ఏమాత్రం ఇష్టం లేదు" అని! ఇది విని... సినిమాల్లో చేసేవి అన్నీ ఇష్టపడే చేస్తారా? ఒక్కసారి వచ్చి అందరినీ ఉత్సాహపరిచి వెళ్లొచ్చుగా అని స్థానిక యువత నిర్వాహకులు చెవులు గొనుక్కుంటున్నారట! ఏది ఏమైనా.. కమిట్ మెంట్ కోసం కోట్లు వద్దనుకోవడం ఆశ్చర్యమే!!