మాజీ అందాల తార శ్రీదేవికి.. దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులు ఉంటారు. దక్షిణాది నుంచి బాలీవుడ్ కి వెళ్లి సుదీర్ఘ కాలం నెంబర్ వస్ ప్లేస్ లో తిష్ట వేసుకుని కూర్చున్న ఈ మాజీ హీరోయిన్.. ఇప్పుడు ఇద్దరు చక్కని చుక్కలకు తల్లి అనే సంగతి తెలిసిందే. ఇటు పెద్ద కూతురిని హీరోయిన్ చేసే ప్రయత్నాలతో పాటు.. తను కూడా మామ్ అనే మూవీ చేసేసింది శ్రీదేవి.
అమ్మపై తీస్తున్న సినిమా కావడం.. ఆ మూవీ రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో.. మదర్స్ డే సందర్భంగా ఓ టెలివిజన్ షోకు శ్రీదేవి హాజరైంది. స రి గ మ ప లిటిల్ ఛాంప్స్ సీజన్6కి వచ్చిన శ్రీదేవి.. తన పిల్లలు తన పాటపై చేసే కామెంట్స్ ను చెప్పి ఆశ్చర్యపరిచింది. వాళ్లు నిద్రపోయేందుకు నేను ఏదైనా కథ చెబితే అసలు నిద్రపోరు. వాళ్లను పడుకోబెట్టేందుకు నేను పాట పాడ్డం మొదలుపెట్టగానే ఇట్టే నిద్రపోతారు. నా గొంతుతో పాట వినలేక వెంటనే పడుకునిపోయేవారు. వాళ్లకు అసలు నా గొంతు నచ్చనే నచ్చదు అని చెప్పింది శ్రీదేవి.
అమ్మ లేకుండా.. అమ్మ కాకుండా ఒక మహిళకు పరిపూర్ణత రాదు అంటూ కొటేషన్ బాగానే చెప్పింది కానీ.. శ్రీదేవి తన స్వరంపై చేసుకున్న కామెంట్స్ చాలామంది అభిమానులను హర్ట్ చేసేశాయి