ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటిసినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఆయన ?జ్యో అచ్యుతానంద? అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా శ్రీనివాస్ మార్క్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని సమాచారం.
ఇక కొద్దినెలల క్రితం ఆర్భాటాలేవీ లేకుండా సెట్స్పైకెళ్ళిన సినిమా దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ పోర్షన్కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెజీనా జ్యోత్స్న అనే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ కోడూరి అందించిన ఆడియో త్వరలోనే విడుదల కానుంది.