Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 12:26:55
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సీక్వెల్ బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్న దర్శక ధీరుడు రాజమౌళి.. ఈమధ్య వేరే పనులు పెద్దగా పెట్టుకోవడం లేదు. తను ఏవైనా సినిమాలు చూడాలన్నా సరే.. ఎర్లీ మాణింగ్ షోస్ అటెండ్ అయిపోతున్నాడు తప్ప.. బాహుబలి2కి బ్రేక్ మాత్రం పడనివ్వడం లేదు. ఇలాంటి బిజీ టైమ్ లో.. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి.. జక్కన్న ఓ ఈవెనింగ్ ని కేటాయించేశాడు.

ఇందుకు కారణం.. ధోనీ లైఫ్ హిస్టరీపై రూపొందిన బయోపిక్ 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ఆడియో రిలీజ్. సెప్టెంబర్ 24న ధోనీ బయోపిక్ కు తెలుగు ఆడియో విడుదలవుతోంది. ఈ కార్యక్రమానికి.. ఆన్ స్క్రీన్ ధోనీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. రియల్ ఎంఎస్ ధోనీలతోపాటు.. జక్కన్న కూడా అటెండ్ కానున్నాడు. సెప్టెంబర్ 30న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయని చెప్పేందుకు.. ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ఒక్కటే సరిపోతుంది.

ఇప్పటికే క్రేజ్ ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ధోనీ యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ఇందుకు కారణం.. తన స్టోరీని సినిమాగా తీసేందుకు ఏకంగా 40 కోట్ల రాయల్టీ అందుకోవడమే కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆడియో ఫంక్షన్ రాజమౌళి చేతుల మీదుగా జరగనుండడంతో.. ఓపెనింగ్స్ బాగా పెరుగుతాయనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,