Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Dec-2014 16:46:39
facebook Twitter Googleplus
Photo

సుకుమార్ ఇటు దర్శకుడిగానే కాకుండా, అటు నిర్మాతగా కూడా రాణించడానికి ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన 'కుమారి 21F' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆమధ్య 'కరెంట్' చిత్రానికి దర్శకత్వం వహించిన సుర్యప్రతాప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల' ఫేం రాజ్ తరణ్, షీనా బజాజ్ ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 40 రోజుల్లో పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, మరోపక్క తాను ఎన్టీఆర్ హీరోగా రూపొందించే చిత్రానికి సుకుమార్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,