ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్, తాజాగా సునీల్తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత నెలాఖర్లో వైభవంగా ప్రారంభమైన ఈ సినిమా నేడు సెట్స్పైకి వెళ్ళింది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పకడ్బందీగా పూర్తి చేసిన దర్శకుడు నేడు షూటింగ్ మొదలుపెడుతున్నట్లు స్పష్టం చేశారు.
క్రాంతి మాధవ్ గత సినిమాల పేర్లలానే ఈ సినిమాకు కూడా సంతోషం సగం బలం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పరుచూరి ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు ఈడు గోల్డ్ ఎహే అన్న మరో సినిమాను కూడా సునీల్ సెట్స్పైకి తీసుకెళ్ళనున్నారు.