విశాల్-తమన్నా జంటగా నటించిన ఒక్కడొచ్చాడు (తమిళ్ లో కత్తిసాందాయ్) గత శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకి ఇప్పటికే బ్యాడ్ టాక్ వచ్చి.. జనాలు పట్టించుకోవడం మానేశారు కానీ.. ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా దర్శకుడు చేసిన కామెంట్స్.. హీరోయిన్స్ అందరికీ ఒళ్లు మండేలా చేశాయి.
'హీరోయిన్స్ ను ఎక్స్ పోజింగ్ కోసమే తీసుకుంటాం. వాళ్లు ఎంత చూపిస్తే మాస్ జనాలకు అంత కిక్' అని సూరజ్ అనడంతో.. మొదటగా నయనతార ఎడా పెడా వాయించేసింది. 'మేమేమీ స్ట్రిప్పర్స్ కాదు' అంటూ తిట్టిపోసింది. హీరోయిన్ తమన్నాకి ఈ విషయం తెలిసి 'ఆ దర్శకుడు సారీ చెప్పాల్సిందే.. లేకపోతే పరిస్థితి చాలా దూరం వెళుతుంది' అన్నట్లుగా బెదిరించేసింది. ఇండస్ట్రీ నుంచి కూడా ఈ దర్శకుడి కామెంట్స్ కి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగొచ్చిన ఈ దర్శకుడు.. క్షమాపణలు చెప్పాడు.
తను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానంటూ.. ఓ క్షమాపణ పత్రం కూడా రాశాడు సూరజ్. ' తమన్నాతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోయిన్స్ అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. వారి సెంటిమెంట్స్ ను దెబ్బ తీయాలని అనుకోలేదు. మరోసారి సారి చెబుతూ నా కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నా' అన్నాడు సూరజ్.