ప్రస్తుతం రామ్ చరణ్ .. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటించనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఆయన తరువాత సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. సురేందర్ రెడ్డికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు.
ఇటు మాస్ .. అటు క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా యూత్ కి నచ్చే విధంగా ఆయన కథను ఆవిష్కరించే తీరు బాగుంటుంది. అందుకే చరణ్ ఆయన దర్శకత్వంలో చేయడానికి ఆసక్తిని కనబరిచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సురేందర్ రెడ్డికి ఈ సినిమాకి సంబంధించిన కథను కోన వెంకట్ - గోపీమోహన్ వినిపించారట. కిక్ 2 తరువాత సురేందర్ రెడ్డి .. శ్రీనువైట్ల సినిమా తరువాత చరణ్ చేయనున్న సినిమా ఇదేనని తెలుస్తోంది.