Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2016 10:57:47
facebook Twitter Googleplus
Photo

నటుడు సూర్య మరోసారి గ్రామీణ బాట పట్టనున్నారా? అనుబంధాలు, ఆత్మీయత నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధం అవుతున్నారా? లుంగీ కట్టుతో దుమ్మురేపనున్నారా? ఈ ప్రశ్నలకు ఓకే సమాధానం అవునన్నదే. ప్రస్తుతం ఎస్-3 చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న సూర్య ఆ చిత్రంలో అందాల భామలు అనుష్క, శ్రుతిహసన్‌లతో డ్యూయెట్లు పాడుతున్నారు. ఈ చిత్రం తరువాత సూర్య నటించే చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తన తదుపరి చిత్రం కబాలి చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో ఉంటుందని సూర్య ఇటీవలే వెల్లడించారు.

తాజాగా ఆయనతో చిత్రం చేయడానికి మరో యువ దర్శకుడు ముత్తయ్య రెడీ అయినట్లు తాజా సమాచారం. కుట్టిపులి, కొంబన్,మరుదు అంటూ వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన ముత్తయ్య నాల్గవ చిత్రానికి రెడీ అయినట్లు తెలిసింది. ఇందులో సూర్య కథానాయకుడిగా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ముత్తయ్య దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినవే అన్నది గమనార్హం. తన తాజాగా చిత్రాన్ని అదే బాణీలో రూపొందించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.

యాక్షన్, డ్రామా ప్రధానాంశాలుగా పక్కా కమర్షియల్ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం తండ్రీ కొడుకుల ఇతివృత్తంగా ఉంటుందని సమాచారం. ఇందులో సూర్యకు తండ్రిగా రాజ్‌కిరణ్ నటించనున్నట్లు తెలిసింది. వేల్ చిత్రం తరువాత సూర్య ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపించనున్నారన్న మాట. అన్నట్టు దీనికి తందై సొల్ మిక్క మందిరం ఇల్లై అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

దర్శకుడు ముత్తయ్య కుట్టిపులి చిత్రాన్ని తల్లీ కొడుకుల సెంటిమెంట్‌తోనూ, మామ అల్లుళ్ల అనుబంధాల ఇతివృత్తంతో, మరుదు చిత్రాన్ని బామ్మ మనవడుల ప్రేమానురాగాలను తెరపై ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు. తాజాగా తండ్రీ కొడుకుల అనుబంధాలను హృద్యంగా చూపించడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇంతకీ సూర్య ముందు రంజిత్ దర్శకత్వంలో నటిస్తారా? లేక ముత్తయ్యతో చిత్రం చేస్తారా? అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

,  ,  ,  ,  ,  ,  ,