ఎంత పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వాళ్లయినా.. పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా సరే.. సినిమా స్టార్లను చూస్తే ఎగ్జైట్ అయిపోతారు. వాళ్లతో ఫొటోలు దిగడానికి.. మాట్లాడ్డానికి అమితమైన ఉత్సాహం చూపిస్తారు. నిన్న తలసాని శ్రీనివాసయాదవ్ కూతురు స్వాతి పెళ్లిలోనూ ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. ఈ పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. మామూలుగా బయటి వేడుకలకు దూరంగా ఉండే మహేష్ బాబు సైతం ఈ పెళ్లికి వచ్చాడు. పెళ్లికి చాలామంది హీరోలు వచ్చినా సరే.. మహేష్ బాబును చూడగానే పెళ్లికూతురు స్వాతి ఎగ్జైట్ అయిపోయింది.
వేదిక మీదకి వచ్చి కొత్త దంపతుల్ని ఆశీర్వదించి ఫొటోలకు పోజిచ్చిన అనంతరం మహేష్ వెళ్లబోతుంటే స్వాతి అతణ్ని ఆపింది. తనతో సెల్ఫీ దిగాలని అడిగింది. మహేష్ అభ్యంతరపెట్టకుండా ఆమెతో సెల్ఫీ దిగాడు. ఈ పరిణామం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. పెళ్లికూతురు సెల్ఫీ తీసుకోవడాన్ని అందరూ ఆసక్తిగా చూశారు. ఆమె తండ్రి తలసానితో పాటు పెళ్లికొడుకు కూడా సరదాగా నవ్వుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. నందమూరి బాలకృష్ణ.. అక్కినేని అఖిల్.. గోపీచంద్.. మంచు మనోజ్ లాంటి చాలామంది సెలబ్రెటీలు హాజరయ్యారు.