Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 10:58:24
facebook Twitter Googleplus
Photo

సౌత్ క్వీన్ అయ్యే అవకాశం అనూహ్యంగా తమన్నాని వరించింది. త్రిష - సమంత - అమలాపాల్ తదితర భామలందరినీ ఊరించి ఊరించి తమన్నా దగ్గరికి వచ్చింది ఆ సినిమా. మొదట తమిళం క్వీన్ కోసమే ఆమెని ఎంపిక చేసుకున్నారు. కానీ ఇప్పుడు తెలుగులోనూ ఆమేనట. దాంతో మిల్కీ బ్యూటీ ఆనందానికి అవధుల్లేవు. నేను క్వీన్ అయ్యానోచ్ అంటూ మీడియా ముందూ సన్నిహితుల దగ్గర ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. దాంతో పాటు మరిన్ని కొత్త ప్రాజెక్టులకీ ఆమె సంతకాలు చేసినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నాగార్జున సినిమాలోనూ ఆమె ఓ కథానాయికగా ఎంపికైందట.

నాగ్ కథానాయకుడిగా ఓంకార్ దర్శకత్వంలో `రాజుగారి గది2` సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు కథానాయికలకి చోటుంది. ఓ కథానాయికగా తమన్నాని - మరో కథానాయికగా సీరత్ కపూర్ ని ఎంపిక చేసుకొనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. అదేగనక నిజమైతే తమన్నా మరో లక్కీ ఛాన్స్ కొట్టినట్టే. నాగార్జున సినిమాలో తమన్నా నటించడం ఇదేం కొత్త కాదు. ఊపిరిలోనూ నటించింది. అయితే ఆ సినిమాలో కార్తీకి జోడీగా నటించింది రాజుగారి గది2లో మాత్రం నాగ్ సరసన కనిపించబోతోంది మిల్కీ. తమిళంలో ఇప్పటికే పలు చిత్రాలతో జోరుమీదున్న తమన్నా తెలుగులోనూ దూకుడు పెంచనున్నట్టు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,