సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ఏ విషయంలో కోపం వచ్చిందో చెప్పడం కష్టమే కానీ.. ఆయన చేసిన ట్వీట్స్-కామెంట్స్ బాగా కఠినంగానే ఉన్నాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. వేటూరి సుందరామమూర్తిల తర్వాత అసలు పాటల రచయితల్లో పస ఉండడం లేదన్నది ఆయన వ్యాఖ్య.
ఇది లిరిక్ రైటర్స్ ను బాధ పెట్టే విషయం అయితే.. మరో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ మరీ దారుణం గానే ఉన్నాయి. కీరవాణి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఆయన అసిస్టెంట్ జీవన్ కోసం థమన్ ప్రయత్నించడం నిజమే కావచ్చు. అలాగని నేరుగా అలా అనేయడం అంత కరెక్ట్ కాదనే కామెంట్స్ తమన్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం ఇళయరాజా దగ్గర అసిస్టెంట్ గా చేశారు కీరవాణి. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మతో సాన్నిహిత్యం పెరగడం కారణంగానే.. ఆ తర్వాత క్షణక్షణం మూవీ ఆఫర్ అందుకున్నారాయన.
మరి తన గురువు ఇళయరాజా క్లయింట్ అయిన వర్మకు దగ్గరయ్యి.. తను సినిమాలు చేసినప్పుడు లేని తప్పు.. రిటైర్మెంట్ ప్రకటించాక అసిస్టెంట్ ను తన దగ్గరకు రమ్మన్నప్పుడు తప్పు ఎలా అవుతుందని తమన్ అభిమానులు అంటున్నారు.