చెన్నై బ్యూటీ త్రిష తన కెరీర్ లో చాలానే కేరక్టర్స్ చేసింది కానీ.. దెయ్యం పాత్రల్లో డిఫరెంట్ గా ట్రై చెయ్యడం ఈ మధ్యనే మొదలుపెట్టింది. నాయకి అంటూ దెయ్యంగా కనిపించడమే కాదు.. డ్యుయల్ రోల్ కూడా సందడి చేసిందీ చెన్నై బ్యూటీ. ఇప్పుడు కూడా మోహిని అంటూ మరో హారర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న త్రిష.. త్వరలో ఆడియన్స్ కి పాంచ్ పటాకా చూపించనుంది.
ఇవాల్టి రోజుల్లో హీరోయిన్ గా తీసుకున్న పాత్రకే భామలకు సరిగా కేరక్టర్ ఉండడం లేదు. అలాంటి టైమ్ లో.. త్రిష ఏకంగా ఐదు పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇలా ఐదు అంతకంటే ఎక్కువ పాత్రల్లో స్వర్గీయ ఎన్టీఆర్-ఏఎన్నార్ లు.. మాత్రమే నటించారు. దశావతారంలో కమల్ హాసన్ ఏకంగా పది పాత్రలు చేసేశాడు. మళ్లీ ఒకే సినిమాలో ఐదు రోల్స్ తో త్రిష లేటెస్ట్ జనరేషన్ హీరోయిన్లలో రికార్డు సృష్టించేయనుంది.
ఈ ఐదు పాత్రల్లో రెండింటి కోసం బాగా బరువు తగ్గనుందట త్రిష. ఇన్ని రోల్స్ లో చేసినందుకు పారితోషికంగా కోటి రూపాయలు పుచ్చుకుంటున్న ఈ చెన్నై చిన్నది.. కేవలం కాస్ట్యూమ్స్ కోసమే 25 లక్షలు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇళవరసన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుండగా.. మోహిని మూవీని కంప్లీట్ చేయగానే ఈ పాంచ్ పటాకాను ప్రారంభించనుంది త్రిష.