Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 10:59:42
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్.. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలను ఫినిష్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ ను.. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు మిస్టర్ ను పూర్తి చేసేశానంటున్నాడు.

మిస్టర్ టాకీ పార్ట్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఫిదా కోసం అమెరికా వెళ్లిపోతున్నా అంటూ ఓ సెల్ఫీతో పాటు ట్వీట్ పెట్టాడు వరుణ్ తేజ్. ఈ కుర్రాడు ఎలాగూ రాకింగ్ లుక్స్ తో అదరగొట్టేస్తూనే ఉంటాడు కాబట్టి.. కాసేపు సినిమాల సంగతే చెప్పుకుందాం. శ్రీను వైట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న మిస్టర్ మూవీ టీజర్ ఇప్పటికే ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందని స్వయంగా హీరోనే కన్ఫర్మేషన్ ఇచ్చాడు. రెండు నెలల క్రితమే పూర్తయి ఉండాల్సింది కానీ.. ఊటీ షూటింగ్ లో వరుణ్ తేజ్ కాలికి గాయం కావడంతో.. రెండు ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి.

ఈ మూవీలో లావణ్య త్రిపాఠి.. హేభా పటేల్ లతో రొమాన్స్ చేయనున్నాడు మిస్టర్ మెగా హీరో. మరోవైపు మలయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ములతో ఫిదా మూవీని కూడా దాదాపు చివరి దశకు తెచ్చేశాడు వరుణ్ తేజ్. అమెరికా షెడ్యూల్ తర్వాత.. తిరిగి ఇండియా వచ్చాక కొంత పార్ట్ మాత్రమే పెండింగ్ ఉంటుందని.. అది కూడా మార్చ్ చివరికల్లా పూర్తయిపోనుందని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,