వెంకీ ఇండీస్ట్రీ లో అడుగుపెట్టి 30 ఏళ్ళు గడిచింది. అయినాగానీ తన స్టయిల్ , నటన , గ్లామర్ లలో ఎక్కడ ఏ మార్పు రాలేదు. కానీ ఈ మధ్య జరిగిన బాబు బంగారం ఆడియో వేడుకలో సినిమాలు తగ్గిస్తానని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. నిజానికి వెండి దృశ్యం తర్వాత చాల గ్యాప్ తీసుకొని బాబు బంగారం సినిమా చేసాడు.
వయసు పెరిగిందనే లేక యంగ్ హీరోల రాక తో సినిమాలు తగ్గించాలని అని అనుకున్నాడో తెలియదు కానీ ఈ వార్త చెప్పి ఫ్యాన్స్ ను కాస్త కలవరపాటుకు గురిచేశాడు. నిజంగానే వెంకీ సినిమాలు తగ్గిస్తాడో అని భావిస్తున్న తరుణం లో వరుస పెట్టి సినిమాలకు సైన్ చేయడం ఫ్యాన్స్ కు పండగ వాతావరణం తెప్పిస్తుంది. తాజాగా వెంకటేష్ మూడు సినిమాలకు ఒకే చెప్పాడు. నేను శైలజ తో సూపర్ హిట్ కొట్టిన కిషోర్ తిరుమలతో , ఇటీవల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగొడుతున్న బిచ్చగాడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన శశి తో , అలాగే బాలీవుడ్ మూవీ సాలా ఖద్దూస్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు సైన్ చేశాడు. ఇలా మూడు చిత్రాలతో వెంకీ బిజీ కావడం తో మరో 10 ఏళ్ళు వెంకీ ఎటుపోడు అని అభిమానులు ఫిక్స్ అయ్యారు.
మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ?బాబు బంగారం ? ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.