Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2016 12:28:34
facebook Twitter Googleplus
Photo

భల్లాలదేవుడిగా బాహుబలి2 షూటింగ్ ను ఎట్టకేలకు ఫినిష్ చేసుకున్న దగ్గుబాటి రానా.. తన నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టేశాడు. ఇండియాలో సబ్ మెరైన్ థీమ్ తో తీస్తున్న తొలి సినిమా ఘాజీని ఫినిష్ చేసేందుకు నిర్ణయించిన రానా.. ఇప్పటికే యూనిట్ తో జతైపోయాడు. కేవలం కొన్ని వారాల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉండడంతో.. ముందు దీన్ని ఫినిష్ చేసేసి.. ఆ తర్వాత తన ఇతర కమిట్మెంట్స్ పై దృష్టి పెడతాడట రానా.

ఇప్పుడీ ఘాజీ కోసం.. తన బాబాయి కం బాబు బంగారం అయిన విక్టరీ వెంకటేష్ ని కూడా లైన్ లో పెట్టేశాడట రానా. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధానికి సంబంధించిన థీమ్ కావడంతో.. ఈ చిత్రాన్ని నేరేట్ చేసేందుకు గాను.. ఎవరితో అయినా వాయిస్ చెప్పించాల్సి ఉంటుంది. ఒకసారి మాత్రమే కాకుండా.. సినిమాలో పలు దశల్లో స్టోరీని నేరేట్ చేయాల్సి ఉండడంతో.. ఆ బాధ్యతలను బాబాయి చేతిలో పెట్టాడట రానా. ఈ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చడంతో వెంకీ కూడా సై అనేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న చివరి దశ షూటింగ్ తర్వాత.. గ్రాఫిక్ వర్క్ చేయాల్సి ఉండగా.. ఆ తర్వాత డబ్బింగ్ సమయానికి ఘాజీలోకి వెంకీ ఎంటర్ అవుతారు. ఇక ఫిబ్రవరి 24న ఘాజీ రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేసేసింది నిర్మాణ సంస్థ పీవీపీ.

,  ,  ,  ,  ,  ,