పందెంకోడి, పొగరు, భరణి, పూజ, జయసూర్య వంటి కమర్షియల్ విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ తెర మీదనే కాదు తెర వెనుక కూడా హీరోనే. తన చుట్టూ ఉన్న వారు బాగుండాలి , వారికీ కష్టం వస్తే నాకు వచ్చినట్లే అని భావించే నటుడు. చెన్నై వరదల్లో చిక్కుకున్న సమయంలో హీరో విశాల్ వీధి వీధికి తిరిగి తనకు చేతనైన సాయం అందించాడు.
తన వంతు సాయం తో ప్రజల కష్టాలు తీరుస్తూ ఎప్పుడు మీడియా లో ఉండే విశాల్ , ఈరోజు తన పుట్టినరోజు నాడు ఓ మంచి పని చేసి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. చెన్నై లోని పుట్ పాత్ జీవనం గడుపుతున్న వారి కోసం ఓ సోషల్ ఆర్గనైజేషన్ ను స్థాపించి వారి బాగోగులను చూడామణి ఆ సంస్థకు మూల ధనంగా రూ.5 కోట్లను ఇచ్చాడు విశాల్.
ఫుట్ పాత్ మీద జీవనం గడుపుతున్న వారి జీవితం ఎంతో దుర్భరంగా ఉంటుందని , కనీసం ఒక పూటైనా తిండి తినలేని పరిస్థితి వారిది అలాంటి వారికీ కావలసిన కనీస అవసరాలను సమకూర్చాలని విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడటా. ఈ సంస్థ లో విశాల్ తో పాటు చాలా మంది హీరోలు భాగస్వాములు కానున్నారట.