Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 13:09:35
facebook Twitter Googleplus
Photo

రజినీకాంత్-శంకర్ రల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 2.0. రోబోకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్.. ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ మొత్తానికి.. హైలైట్ ఎపిసోడ్ ను ప్రస్తుతం పిక్చరైజ్ చేస్తున్నారని తెలుస్తోంది.

చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్ తో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ నే పిక్చరైజ్ చేస్తుండగా.. సూపర్ స్టార్ తో పాటు.. హీరోయిన్ అమీ జాక్సన్.. విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ లు కూడా ఈ షెడ్యూల్ లో పాలు పంచుకుంటున్నారు. అందరు కలిసి చేసే ఏరియల్ స్టంట్స్ అదిరిపోయేలా పిక్చరైజ్ చేస్తున్నాడట దర్శకుడు శంకర్. ఇందుకోసం హాలీవుడ్ నుంచి ప్రముఖ యాక్షన్ కంపోజర్లను తీసుకొచ్చారు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి కొత్త ఏరియల్ సీక్వెన్స్ లు 2.0లో కనిపిస్తాయని అంటున్నారు.

12 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో చిత్రీకరించే ఎపిసోడ్.. మొత్తం సినిమాకే హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ సూపర్బ్ మూవీ 2.0 ను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలన్నది దర్శకుడు శంకర్ ఆలోచన. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని రూపొందిస్తోంది.

,  ,  ,  ,  ,